telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మాజీ మంత్రి జువ్వాడి కన్నుమూత

Juvvadi Ratnaker Rao

మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌ రావు ఆదివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, కరీంనగర్ ‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారని కుటుంబీకులు వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఓ దశలో తిరుగులేని రాజకీయ నాయకుడిగా ముద్రపడిన ఆయన స్వగ్రామం ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్. 2004 లో వరుసగా బుగ్గారం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో కోరుట్ల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జువ్వాడి మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Related posts