telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సంచలన నిర్ణయం… ఎన్టీఆర్ ఘాట్ సందర్శన రద్దు

ntr

నంద‌మూరి సోద‌రులు జూనియ‌ర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్‌లు రేప‌టి ప్రోగ్రాంని క్యాన్సిల్ చేసుకున్నట్టు తెలుస్తోంది. మే 28న స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు జ‌యంతి. ఈ సంద‌ర్భంగా నంద‌మూరి ఫ్యామిలీ అంతా ప్ర‌తి ఏడాది ఎన్టీఆర్ ఘాట్‌కి వెళ్ళి నివాళులు అర్పిస్తారు. క‌రోనా వల‌న ఈ సారి దీనిని ర‌ద్దు చేసుకున్నారు. త‌మ అభిమాన హీరోలు ఆ ప్రాంతానికి వ‌స్తున్నార‌ని తెలిసిన అభిమానులు ఎన్టీఆర్ ఘాట్‌కి భారీగా చేరుకునే అవ‌కాశం ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల‌లో తాము ఇంటి వ‌ద్ద ఉండి తాత‌య్య‌కి అశ్రు నివాళులు అర్పిస్తే బాగుంటుంద‌ని ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. క‌రోనా ఎఫెక్ట్‌తో అనేక కార్య‌క్ర‌మాలు ర‌ద్దు అవుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌నావాసాల‌లోకి ఎక్కువ‌గా వెళ్లొద్ద‌ని నిబంధ‌న ఉన్న నేప‌థ్యంలో సెల‌బ్రిటీలు కూడా చాలా కార్య‌క్ర‌మాల‌ని ర‌ద్దు చేసుకుంటున్నారు.

Related posts