తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు ఇప్పుడు రమ్యకృష్ణకు విపరీతమైన క్రేజ్ వుంది. ‘బాహుబలి’లో శివగామి పాత్ర నుంచి, కీలకమైన పాత్రలను చేస్తూ వెళుతోంది. పవర్ఫుల్ పాత్ర ఏదైనా వుంటే ముందుగా దర్శకనిర్మాతలు ఆమెనే సంప్రదిస్తున్నారు. ఇటీవల ‘క్వీన్’ వెబ్ సిరీస్లో దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్ర పోషించి మెప్పించారు రమ్యకృష్ణ. మరోసారి ఆమె ముఖ్యమంత్రిగా కన్పించబోతున్నారని అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. సాయితేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తేజ్ డాక్టర్గా, రమ్యకృష్ణ శక్తిమంతమైన ముఖ్యమంత్రిగా నటిస్తున్నారని సమాచారం. ఏలూరులో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. మొదట రమ్యకృష్ణ పాత్రకోసం విజయశాంతిని సంప్రదించారట. ఆమె సున్నితంగా తిరస్కరించడంతో రమ్యకృష్ణను ఎంపిక చేసినట్లు చిత్ర వర్గాల నుంచి సమాచారం. నివేదా పేతురాజ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జె.భగవాన్, పుల్లారావు నిర్మిస్తున్నారు.
previous post
ఇండస్ట్రీలో 50 శాతం పనికిరాని వాళ్లే… కరోనా వల్ల వాళ్ల శాతం తగ్గుతుంది… డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్