విధి నిర్వహణలో ఉన్న వైద్యులు రోగుల సమస్యలు పట్టించుకోకుండా టిక్ టాక్ లు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. తీరా ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారిఉద్యోగాలకే ముప్పు వాటిల్లింది. వివరాల్లోకి వెళితే సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జూనియర్ వైద్యులు టిక్ టాక్ చేసి ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యారు. .
ఒకవైపు రోగులు వైద్యం అందక ఇబ్బంది పడుతుంటే వైద్యులు టిక్ టాక్ చేస్తూ కాలక్షేపం చేయడం గమనార్హం. గాంధీ ఆస్పత్రిలోని ఫిజయో థెరపీ విభాగంలోని జూనియర్ వైద్యులు చేసిన టిక్ టాక్ వీడియోలు ఇప్పుడు నె వైరల్ గా మారడంతో ఇద్దరు జూనియర్ వైద్యులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఫిజయోథెరపీ విభాగంలో టిక్ టాక్ చేసిన ఇద్దరు జూనియర్ వైద్యులను సస్పెండ్ చేశారు. ఆ విభాగం ఇన్ ఛార్జిని కూడా ఆస్పత్రి సూపరింటెండెంట్ సస్పెండ్ చేశారు.