ఏపీ సీఎం జగన్ కు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బహిరంగ లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోదీ అగ్రవర్ణాల పేదలకు తీసుకొచ్చిన 10 శాతం రిజర్వేషన్ యువతకు వరంగా మారిందనిఆయన తెలిపారు. కానీ ఇది ఏపీలో ఇంకా అమలు కావడం లేదన్నారు. దీనివల్ల చాలా మంది యువత అవకాశాలు కోల్పోతున్నారనీ వివరించారు.
విద్యావంతులైన యువత నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారని లేఖలో పేర్కొన్నారు. యువకు ఉపాధి కలిపించే విషయంలో ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించాలని కన్నా డిమాండ్ చేశారు. ఏపీలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ చట్టం అమలు కోసం చర్యలు తీసుకోవాలని లేఖలో కన్నా కోరారు.