కర్ణాటకలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్పకు గవర్నర్ వాజూభాయ్ వాలా అనుమతి ఇచ్చారు. అసెంబ్లీలో యడ్యూరప్ప బలాన్ని నిరూపించుకునేందుకు ఈ నెలాఖరు వరకూ గడువు విధించారు. 31వ తేదీలోగా అసెంబ్లీలో విశ్వాస పరీక్షను నెగ్గాలనిగవర్నర్ ఆదేశించారు. నేడు కర్ణాటకకు నాలుగోసారి సీఎంగా యడ్యూరప్ప నేటి సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
76 సంవత్సరాల వయసున్న యడ్యూరప్ప స్థానంలో మరొకరిని సీఎంగా ఎంపిక చేయాలని బీజేపీ అధిష్ఠానం భావించినప్పటికీ, స్థానిక బలాబలాలు యడ్యూరప్పకే అనుకూలంగా మారాయి. ఇక తన సర్కార్ గడువులోగానే అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవడం అంత సులువేమీ కాదని తెలుస్తోంది. ఒకవేళ బలాన్ని నిరూపించుకున్న బీజేపీ సర్కారుకు తిప్పలు తప్పవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.