telugu navyamedia
విద్యా వార్తలు

ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

AP Eamcet counsling

ఎట్టకేలకు ఏపీ సర్కార్ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసింది. విద్యార్థులు రేపటి నుంచి ఆయా కళాశాలలకు ఆప్షన్లు ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసె లో పొందిన ట్ర్యాంకుల వారీగా ఆప్షన్ల ఎంపికకు తేదీలను ప్రకటించింది. అన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో గతేడాది ఫీజులు యధావిధిగా వర్తిస్తాయని స్పష్టం చేసింది. జగన్ పాతయాత్రలో ఇచ్చిన  హామీ మేరకు విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం చెల్లించనుంది. గతేడాది వరకూ రూ.35వేల ఫీజు మాత్రమే ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ ఇచ్చింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో లక్షలాది మంది విద్యార్థులు లబ్ధి పొందే అవకాశముంది. 

Related posts