telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

‘గాంధీ’లో కరోనా టెస్టులు చేయాలి: హైకోర్టు

high court on new building in telangana

కరోనా టెస్టులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. గాంధీ ఆసుపత్రిలో కోవిడ్  టెస్టులు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి  వ్యక్తం చేసింది. గాంధీ’లో కరోనా పరీక్షలు  చేయాలని ప్రభుత్వానికి కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం కల్పించిన అధికారాలతో ప్రైవేటు ఆసుపత్రులను నియంత్రించాలని స్పష్టం చేసింది.

కరోనా రోగుల నుంచి రూ.4 లక్షలకు పైగా బిల్లులు వసూలు చేసిన యశోద, కిమ్స్ ఆసుపత్రులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రైవేటు ల్యాబ్ ల్లో అన్నిరకాల పరీక్షలకు గరిష్ఠ చార్జీలు ఖరారు చేయాలని సూచించింది. నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో కరోనా పరీక్షల నిర్వహణ పై ఈ నెల 27 లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు సూచింది.

Related posts