జార్ఖండ్లో దారుణం చోటుచేసుకుంది. జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం) సీనియర్ నేత శంకర్ రావణి, ఆయన భార్య బాలికాదేవి దారుణ హత్యకు గురయ్యారు. ధన్బాద్ జిల్లాలోని బౌరా ప్రాంతంలో శనివారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. దీంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఉదయం ఇరుగుపొరుగు వారి సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని….శంకర్, బాలికాదేవి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తొలుత వీరిపై కాల్పులు జరిపి…అనంతరం కత్తితో పొడిచి నిందితులు చంపి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఘటనా స్థలం ఉంచి 9 ఎంఎం పిస్టల్ కార్ట్రిడ్జ్, కత్తని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శంకర్ రావణి జేఎంఎం ధన్ బాద్ నగర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని..ఘటనా స్థలంలో స్నిఫ్ఫర్ డాగ్స్ను మోహరించినట్టు ఎస్పీ రామ్కుమార్ పేర్కొన్నారు. రెండు కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షలే ఈ హత్యకు కారణంగా అనుమానిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. కాగా..రెయిన్బో గ్రూప్ చైర్మన్ ధీరేంద్ర రావణి హత్య కేసులో నిందితుడైన శంకర్ రావణి పెద్ద కుమారుడు కునాల్ 2017లో హత్యకు గురయ్యాడు.
రైతు భరోసాపై అట్టుడికిన అసెంబ్లీ.. చంద్రబాబు పై రోజా విమర్శలు