దేశవ్యాప్తంగా పుల్వామాలో జరిగిన ఉగ్రదాడులపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అమరులైన జవాన్లకు నివాళులు అర్పిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదేకోవలో రాజస్థాన్లోని టోంకా జిల్లా కేంద్రంలో వందల మంది యవకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమర వీరులను నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే చర్యలకు పూనుకోవాలి. మౌనంగా ఉండటం పనికిరాదు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఉగ్రవాదులతోపాటు, వారి గ్రూపుపై ప్రతీకారం తీర్చుకోవాలని కోరారు.
ఈ ఘటనపై పలు రాజకీయ, సినీ రంగ సంస్థలు, ప్రముఖులు తగిన చర్యలు తీసుకోవాలి, ఇంకా ఉపేక్షించడం సరికాదని ప్రభుత్వానికి సామజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారు. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా రక్షణ చర్యలు ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనలో మరణించిన జవాన్ల కుటుంబాలను కదిలిస్తే, గుండెలు జల్లు మంటున్నాయి. తమ బిడ్డలు దేశం కోసం ప్రాణాలు అర్పించారని, మిగిలిన బిడ్డలను కూడా రక్షణ రంగంలోకి పంపిస్తామని .. కానీ తీవ్రవాదులను మాత్రం విడిచిపెట్టరాదని.. కన్నీటి పర్యంతం అవుతూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జైహింద్. జై భారత్!