telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

స్నేహం ముసుగులో అత్యాచారం…పుట్టినరోజుకని తీసుకెళ్లి

rape

స్నేహం ముసుగులో అత్యాచారం చేసారు దుర్మార్గులు. పుట్టినరోజుకని తీసుకెళ్లి  సామూహిక అత్యాచారం చేసి.. బయటకు చెబితే చంపేస్తామని బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. ముగ్గురు యువకులు తమ స్నేహితురాలైన డిగ్రీ విద్యార్థినిని పుట్టినరోజు వేడుకకని లాడ్జికి తీసుకెళ్లి కేకులో మత్తుమందు కలిపి సామూహికంగా అత్యాచారం చేశారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని యువకులు బెదిరించారు.  అసలేం జరిగిందంటే.. జూబ్లీహిల్స్‌లో ఉంటున్న ఓ యువతి సికింద్రాబాద్‌లోని కళాశాలలో డిగ్రీ చదువుతోంది. పుట్టినరోజని, నవీన్‌, రాములుతో కలిసి వేడుక చేసుకుందామని ఆ యువతిని జోసెఫ్ ప్రతిపాదించాడు. స్నేహితులన్న నమ్మకంతో యువతి సరేనంది.

కళాశాల నుంచే నలుగురూ ఓ హోటల్‌కు వెళ్లారు. పథకం ప్రకారం ముందుగా కేక్‌పై మత్తుమందు చల్లారు. అందరం కలిసి తిందామని యువతి అనగా.. ముందు నువ్వే తినాలంటూ జోసెఫ్‌ ఆమెకు తినిపించాడు. కొద్దిసేపటికే ఆమె మత్తులోకి వెళ్లింది. ముగ్గురూ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించిన నిందితులు ఆమెను ఆటోలో ఇంటికి పంపించేశారు. ఆరోజు నుంచి బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈనెల 11న అపస్మారకస్థితికి వెళ్లగా.. తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమె జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన సైబరాబాద్‌ పరిధిలో జరగడంతో జీరో ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు చేసి సైబరాబాద్‌ పోలీసులకు బదిలీ చేశారు.

Related posts