telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రామున్ని ఒక రాజకీయ నాయకుడిగా బీజేపీ చేసింది..

jaggareddy in pcc race in telangana

రాహుల్ గాంధీ పై అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా వ్యాఖ్యలను ఖండిస్తున్నాని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అమెరికా రాజకీయాలు వేరు…భారతదేశం రాజకీయం వేరని…ఇక్కడ వంద కులాలు 10 మతాలు ఉంటాయని తెలిపారు. భారతదేశంలో ప్రస్తుతం ఎమోషనల్ పొలాటిక్స్ నడుస్తున్నాయన్నారు. బీజేపీ హిందు రాజకీయం, ఎంఐఎం ముస్లిం, టీఆర్‌ఎస్‌ ప్రాంతీయ వాద రాజకీయం చేస్తుందని..భారత దేశం లో ఎక్కువ కుల పరమైన రాజకీయాలు నడుస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ కి కుల, మత రాజకీయాలు చేసే పార్టీ కాదని..కాంగ్రెస్ పార్టీ సెక్యూలర్ పార్టీ అని పేర్కొన్నారు. స్వాతంత్రం నుండి కాంగ్రెస్ పార్టీ కి ఒక చరిత్ర ఉందని..అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎమోషనల్ పాలిటిక్స్ చేయదన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ భావంతో ప్రపంచ దేశాల సత్సంబంధాలతో నడిచే పార్టీ అని…ఈ విషయాలు అవగాహన లేక ఒబామా రాహుల్ గాంధీ పై విమర్శలు చేయడం తగదని హెచ్చరించారు. శ్రీరాముడిని ఒక బీజేపీ పార్టీ ఒక్కటే పూజించదని..శ్రీరాముడిని కాంగ్రెస్ తోపాటు అన్ని రాజకీయ పార్టీలు పూజిస్తాయని పేర్కొన్నారు. శ్రీరాముడిని దేవుడిగా చూడాలి కానీ ఒక రాజకీయ నాయకుడిగా చూడొద్దని..కానీ శ్రీరాముడిని దేవుడికంటే ఒక రాజకీయనాయకుడిగా చేసింది బీజేపీ పార్టీ అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ శ్రీరాముడి ఆదేశాలతో పాటు, భాగవద్గిత, బైబిల్, ఖురాన్ ని గౌరవిస్తుందన్నారు.

Related posts