telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

కేసీఆర్ బాటలో జగన్.. ఆధికారం కోసం యాగం!

YS Jagan Write letter to KCR
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలో వైసీపీ అధినేత జగన్ నడుస్తున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో మళ్లీ అధికారంలోకి రావాలనే కాంక్షతో కేసీఆర్ యాగం నిర్వహించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో నెల్లూరులో ఈ నెల 27 నుంచి  వైసీపీ నేతలు శ్రీరాజ్య శ్యామల రాజ్యప్రద ఇంద్రయాగం నిర్వహిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యాగం నిర్వహించారు. 
ఈ యాగంలో శుక్రవారం లో వైఎస్  జగన్ కూడా పాల్గొని వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఏపీలో జరిగే ఎన్నికల్లో తాము జగన్ కి మద్దతుగా ఉంటామంటూ కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే తప్పేంటని జగన్ కూడా ఎన్నికల ప్రచారంలో చెప్పిన విషయం తెలిసిందే.

Related posts