telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

పాక్‌ ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ వైమానిక దాడులు

Indian air force attack Pakistan Terror

పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం తెల్లవారు జామున పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత వైమానికి దళాలు మెరుపు దాడులు చేశాయి. తెల్లవారు జామున 3 గంటలకు జైషే మొహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దళాలు, యుద్ధ విమానాలతో దూసుకెళ్లి బాంబుల వర్షం కురిపించింది. 1000 కేజీల బాంబులతో ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేశాయి. 12 మిరాజ్‌-200 యుద్ధ విమానాలతో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ సర్జికల్‌ స్ట్రైక్‌ 2ను విజయవంతంగా పూర్తి చేసింది. 

కాగా ఈ దాడులపై భారత రక్షణ శాఖ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పుల్వామా దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. మరోవైపు శ్రీనగర్‌లోని వేర్పాటు వాదుల నివాసాల్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. వేర్పాటువాదులు యాసిన్‌, మిర్వాయిజ్‌, షబీర్‌ షా, ఆశ్రఫ్‌ ఇళ్లలో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. వేర్పాటువాదులకు ఇటీవల బద్రతను కూడా తొలగించారు.

Related posts