telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీలోకి దగ్గుబాటి.. రేపే ముహూర్తం!

Daggubati ysrcp candidate from parchur

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు తనవంతు కృషి చేస్తానని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం తాడేపల్లిలో జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు దగ్గుబాటి వెల్లడించారు. మార్టూరులోని ఓ కల్యాణమండపంలో తన అనుచరులు, వైసీపీ నాయకులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనతో పాటు కుమారుడు హితేష్‌ చెంచురామ్‌, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ కూడా వైసీపీలో చేరనున్నారని తెలిపారు.

మాటకు కట్టుబడి ఉండే నేటితరం రాజకీయ నేతల్లో వైఎస్ జగన్ ఒకరని దగ్గుబాటి అన్నారు. ప్రజల ఆశీస్సులతోనే మార్టూరు, పర్చూరు నియోజకవర్గాల నుంచి తాను ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు. దివంగత మంత్రి గొట్టిపాటి హనుమంతరావు కుమారుడు భరత్‌ తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గొట్టిపాటి భరత్ మాట్లాడుతూ దగ్గుబాటిని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.

Related posts