ఏపీ సీఎం జగన్ ఈ నెల 15న తన కుటుంబసభ్యులతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 15న విజయవాడ మునిసిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత అదే రోజు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుని, రాత్రికి శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమెరికా వెళ్లనున్నారు. తిరిగి 24వ తేదీ రాత్రి తాడేపల్లికి తిరిగి వస్తారని సీఎం కార్యాలయం వెల్లడించింది.
తన చిన్న కుమార్తె వర్షారెడ్డిని యూఎస్ లోని ఓ యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్ కోర్సులో చేర్పించేందుకు ఆయన వెళ్లనున్నట్టు సమాచారం. ఇదే సమయంలో 17వ తేదీన డల్లాస్లోని కే బెయిలీ హచిసెన్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం నార్త్ అమెరికాలో నివాసం ఉంటున్న తెలుగు ప్రజలతో జరిగే ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.
చంద్రబాబు విధానాల వల్లే ఆర్థిక ఇబ్బందులు: మంత్రి బొత్స