దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన గణాంకాల ప్రకారం… గత 24 గంటల్లో 45,720 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు నిర్ధారణ కావడం ఇదే తొలిసారి. అదే సమయంలో 1,129 మంది వైరస్ బారినపడి మృతి చెందారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 12,38,635కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 29,861కి పెరిగింది. 4,26,167 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 7,82,606 మంది కోలుకున్నారు. నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,50,75,369 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.