telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

శ్రావణ మాసం ఎఫెక్ట్..పెరుగుతున్న పసిడి ధర

Gold rates hike

శ్రావణ మాసం ఆరంభం కావడంతో బంగారం ధరలు ఊపందుకున్నాయి. ఈ మాసంలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు ముహూర్తాలు అధికంగా ఉంటాయి. దీంతో పసిడి ధర పరుగులు పెడుతోంది. ఢిల్లీలో నిన్న 10 గ్రాములకు రూ. 430 పెరిగి రూ. 50,920కి చేరుకుంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగానే దేశీయంగానూ ధరలు పెరుగుతున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ‌స్ తెలిపింది.

ముంబై మహానగరంలో లో ధర 10 గ్రాములకు రూ.50,181గా నమోదైంది. ఇక, హైదరాబాద్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ. 51,700 ధర పలికింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. ఢిల్లీలో నిన్న కిలో వెండి ధర రూ. 2,550 పెరిగి రూ. 60,400కి చేరుకుంది.

Related posts