telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐసీసీ ర్యాంకింగ్స్… కోహ్లీ పైకి, రోహిత్ కిందికి

తాజాగా ఐసీసీ వన్డే, టీ20 ర్యాంకింగ్స్ ప్రకటించింది. అయితే ఈ ర్యాంకింగ్స్ ప్రకారం వన్డేల్లో అగ్రస్థానంలో, టెస్టులో 5వ స్థానంలో ఉన్న కోహ్లీ.. తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో మూడు హాఫ్ సెంచరీలతో అద్భుత ప్రదర్శన చేసిన కోహ్లీ తన ర్యాంకు‌ను మెరుగుపరచుకున్నాడు. ఆఖరి టీ20లో అర్ధ శతకంతో చెలరేగిన రోహిత్ శర్మ మూడు స్థానాలు మెరుగుపరచుకొని 14వ ర్యాంకులో నిలిచాడు. ఇక ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో వరుస డకౌట్లతో దారుణంగా విఫలమైన కేఎల్‌ రాహుల్‌ ఒక ర్యాంకు కోల్పోయి ఐదో స్థానానికి పడిపోయాడు. టీమిండియా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఐదు స్థానాలు ఎగబాకి కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ 26వ స్థానం సంపాదించాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్‌ ఆటగాడు డేవిడ్‌ మలాన్‌ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 868 రేటింగ్ పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ మూడో స్థానానికి పడిపోయాడు. ఇక బౌలింగ్ లో బుమ్రా మూడులో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్‌ ర్యాంకింగ్స్‌లో జడేజా 9లో ఉన్నాడు. ‌

Related posts