కరోనా వ్యాప్తి పట్ల ప్రజలను చైతన్యం చేయడంలో ప్రసార మాధ్యమాలదే కీలకపాత్ర అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇటీవల అనేక మంది జర్నలిస్టులు కరోనా బారిన పడి మృతి చెందడం పట్ల వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. వారికి నివాళులు అర్పించిన సందర్భంగా మాట్లాడారు.
దేశంలో తాజా పరిస్థితులపై స్పందిస్తూ దేశవ్యాప్తంగా కరోనాపై పోరాటంలో మీడియా నిర్వహిస్తున్న పాత్ర అమోఘం అని కొనియాడారు. సామాజిక మాధ్యమాల్లో జరిగే ప్రచారం చూసి ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.
ఆ విషయం అసంతృప్తి కలిగించింది : నీతి ఆయోగ్