పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మొదటి నుంచి హిట్ ట్రాక్ పై కొనసాగాడు. మధ్యలో కొన్నాళ్లు కెరీర్ డౌన్ అయినా నిరుత్సాహ పడలేదు. మళ్లీ చిత్రలహరి సినిమా నుంచి వరుస హిట్లు అందుకుంటున్నారు. అయితే ప్రస్తుతం సాయి తేజ్ దేవకట్టా దర్శకత్వంలో రిజబ్లిక్ అనే సినిమాను రూపొందిస్తున్నారు. పొలిటికల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రానున్నట్లు తెలుస్తోంది. సాయి తేజ్ కి జోడిగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా.. రమ్యకృష్ణ, జగపతిబాబు పవర్ఫుల్ రోల్ లో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు అం చరణ్ విడుదల చేసాడు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను జె.బి.ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు అన్ కాంప్రమైజ్డ్గా నిర్మిస్తున్నారు. అయితే జూన్ 4న సినిమా విడుదల తేదీగా ఎప్పుడో ఫిక్స్ చేశారు.
previous post
next post
జెమినీ గణేషన్ కు జమున వార్నింగ్… సంచలన వ్యాఖ్యలు