telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

తుఫాను బీభత్సానికి .. నేపాల్ లో 25మృతి, 400 మందికి గాయాలు..

నిన్న రాత్రి హఠాత్తుగా సంభవించిన తుఫాను పెద్ద నష్టాన్నే సృష్టించి వెళ్ళింది. దాని దెబ్బకి హిమాలయ దేశం నేపాల్ లో దక్షిణ భాగంలో 25 మంది మరణించగా, 400 మంది గాయాలపాలయ్యారు. పెనుగాలులకు వర్షం కూడా తోడవడంతో అనేక గ్రామాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి.

ముఖ్యంగా బరా, పర్సా జిల్లాలు తుపాను తాకిడికి గురైనట్టు అధికారులు గుర్తించారు. ఈ రెండు జిల్లాల్లో ఎక్కడ చూసినా విలయం తాలూకు ఆనవాళ్లే కనిపిస్తున్నాయి. తుపాను నష్టంపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలి విచారం వ్యక్తం చేశారు.

Related posts