బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ 2014లో తన భార్య సుసానే ఖాన్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే పిల్లల కోసం మాత్రం వీరిద్దరూ తరచుగా కలుస్తుంటారు. లాక్డౌన్ సమయంలో పిల్లలకు అండగా నిలిచేందుకు వీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసి నివసించారు. ఈ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో సుసానే తాజా కామెంట్ వైరల్ అవుతోంది. సుసానే ఖాన్ నీలిరంగు కోట్, ఫార్మల్ వేర్ ధరించి బిజినెస్ ఉమెన్ లుక్ ఫొటోను షేర్ చేస్తూ… “నన్ను వదిలి వెళ్లిపోయిన వారి కోసం ఏడవను. ఎవరి కోసమూ బాధ పడుతూ ఒక్క రోజును కూడా వృథా చేయను” అంటూ కామెంట్ చేసింది. ఈ కామెంట్ కాస్తా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ విడాకులు తీసుకున్నప్పటికీ పిల్లల కోసం పండగల సమయంలో కలిసే ఉంటారు. ఇక హృతిక్ కూడా సమయం ఉన్నప్పుడు తన పిల్లలతో కలిసి వెకేషన్, టూర్లకు వెళుతూ ఎంజాయ్ చేస్తుంటాడు.
View this post on Instagram
If you leave I won’t cry… I won’t waste a single day.. 🦋😊#neverlookback #eaglesnestwarmth