చికాగో నగరంలో తనతో గొడవపడ్డాడనే కోపంతో ప్రియుడిని కారుతో తొక్కి చంపేసింది ఓ యువతీ. వివరాల్లోకి వెళ్తే… 23 ఏళ్ల బ్రయానా రైస్.. తూర్పు చికాగోలోని ఓ అపార్ట్మెంటు ఎదురుగా తన ప్రియుడు టెర్రండీ జోన్స్తో ఘర్షణ పడింది. దీంతో విసుగెత్తిన జోన్స్.. ఆమెను అక్కడే వదిలి వెళ్లిపోబోయాడు. దీంతో ఆగ్రహించిన బ్రయానా వెంటనే పార్కింగ్లో ఉన్న కారు స్టార్ట్ చేసింది. చాలా వేగంగా దాన్ని రోడ్డెక్కించి.. వెళ్లిపోతున్న జోన్స్ను గుద్దేసింది. కారు ఢీకొనడంతో కారు మీదుగా జోన్స్ ఎగిరిపడ్డాడు. అది గమనించిన బ్రయానా కారును వెంటనే రివర్స్గేరులో తీసుకొచ్చి కిందపడిన జోన్స్ను తొక్కించింది. ఆ తర్వాత ఆ ప్రాంతం నుంచి పారిపోయింది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న అంబులెన్సు తీవ్రంగా గాయపడిన జోన్స్ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అతను మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బ్రయానాను అదుపులోకి తీసుకున్నారు. తనను చంపుతానని జోన్స్ బెదిరించడంతోనే తాను ఈ దురాగతానికి పాల్పడినట్లు బ్రయానా చెప్తోంది. ఈ కేసు విచారణను కోర్టు మే 9కు వాయిదా వేసింది.
previous post
next post
కేసీఆర్ తీరుతో రాష్ట్రం అభాసుపాలు: ఉత్తమ్