దేశంలో కరోనా కలకలం ఇంకా సాగుతూనే ఉంది. ఇప్పటికే అనేక మంది బాలీవుడ్ నటులు, సెలెబ్రిటీలు దీని బారినపడ్డారు. తాజాగా హీరోయిన్ దిశా పటాని తండ్రి జగదీష్ పటాని కి కరోనా సోకింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఉత్తర్ ప్రదేశ్ పవర్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ విభాగంలో ఎస్ పి గా బాధ్యతలు నెరవేరుస్తున్న జగదీష్ పటాని ఓ కేసు విషయమై లక్నో నుండి బెరేలి వెళ్లారట. ఆ సమయంలో ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తుంది. కాగా దిశా తండ్రి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఇక దిశా పటాని దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లోఫర్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితమైన ఈ అమ్మడు రాధే మూవీలో సల్మాన్ సరసన నటించడం విశేషం.
next post