telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టార్ హీరోయిన్ తండ్రికి కరోనా

Disha

దేశంలో కరోనా కలకలం ఇంకా సాగుతూనే ఉంది. ఇప్పటికే అనేక మంది బాలీవుడ్ నటులు, సెలెబ్రిటీలు దీని బారినపడ్డారు. తాజాగా హీరోయిన్ దిశా పటాని తండ్రి జగదీష్ పటాని కి కరోనా సోకింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఉత్తర్ ప్రదేశ్ పవర్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ విభాగంలో ఎస్ పి గా బాధ్యతలు నెరవేరుస్తున్న జగదీష్ పటాని ఓ కేసు విషయమై లక్నో నుండి బెరేలి వెళ్లారట. ఆ సమయంలో ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తుంది. కాగా దిశా తండ్రి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఇక దిశా పటాని దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లోఫర్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితమైన ఈ అమ్మడు రాధే మూవీలో సల్మాన్ సరసన నటించడం విశేషం.

Related posts