telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బెంగళూరు : … డిసెంబర్ లో ఉపఎన్నికలు.. మోగిన డంకా..

election-commission

కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను డిసెంబరు 5న నిర్వహించనున్నట్లు ఎన్నికల ప్రధానాధికారి సంజీవ్‌ కుమార్‌ ప్రకటించారు. ఫలితాలను అదే నెల 9న విడుదల చేయనున్నారు. ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల్లో నియమావళి నవంబరు 11 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. నామినేషన్ల దాఖలు గడువు సోమవారం ప్రారంభమై నవంబరు 18తో ముగియనుంది. కర్ణాటకలో 15 స్థానాలకు ఉప ఎన్నికలు మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలతోపాటే జరగాల్సి ఉండగా, ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉండడంతో ఈసీ వాయిదా వేసింది.

పార్టీ ఫిరాయించిన 15 మంది కాంగ్రెస్‌-జేడీ(ఎస్‌) ఎమ్మెల్యేలపై స్పీకర్‌ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత అసెంబ్లీ కాలం ముగిసే వరకు వారు పోటీ చేయడానికి వీల్లేకుండా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్‌ విచారణ దశలో ఉంది. దీనిపై తీర్పు నవంబరు 13న (బుధవారం) వెలువరించనున్నారు. సుప్రీం కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Related posts