వరుణ్ తేజ్, అథర్వ మురళి ప్రధాన పాత్రలలో హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం గద్దలకొండ గణేష్. ప్రస్తుతం బాక్సాఫీస్ని షేక్ చేస్తున్న గద్దలకొండ గణేష్ చిత్రం తమిళ సూపర్ హిట్ మూవీ జిగర్తాండకి రీమేక్ గా రూపొందింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని 14 రీల్స్ నిర్మించింది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అథర్వకి జంటగా మృణాలినీ రవి నటించింది. సినీ సెలబ్రిటీలు చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. చిరంజీవి, మహేష్బాబుతో పాటు పలువురు స్టార్స్ వరుణ్ నటనపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తొలిరోజే 6.7 కోట్ల షేర్ వసూలు చేసింది. మూడు రోజులు కూడా కలెక్షన్లు అలాగే వచ్చాయి. అయితే నాలుగో రోజు నుంచి వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. దానికి కారణం సినిమాకు నెగిటివ్ టాక్ కాదు.. వర్షాలు రావడం. నాలుగో రోజు కూడా చాలా చోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు కనిపించాయి. కానీ వర్షాలు కూడా జోరుగా పడటంతో చాలా ఏరియాల్లో వసూళ్లపై భారీ ప్రభావమే పడింది. వారం రోజుల్లో ఈ సినిమా 24 కోట్లకు పైగా వసూలు చేస్తుందనుకుంటే.. ఇప్పుడు 19.50 కోట్ల షేర్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కెరీర్లో తొలిసారి పవర్ ఫుల్ రోల్ చేసిన వరుణ్ తేజకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. వర్షాలు కానీ రాకుండా ఉండుంటే ఈ పాటికే అన్నిచోట్లా గద్దలకొండ గణేష్ సేఫ్ జోన్కి వచ్చి సంచలన విజయం సాధించి ఉండేది. అయినా కూడా రెండో వారం సినిమాలేవీ లేకపోవడంతో కచ్చితంగా వసూళ్ల వర్షం కురిపించడం ఖాయం అని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. 25 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన వరుణ్ తేజ్.. ఈ టార్గెట్ ఈజీగానే అందుకునేలా కనిపిస్తున్నాడు.
previous post
next post
విడాకులు తీసుకోవటం వలన బతికిపోయా… భార్యపై సంపత్ కామెంట్స్