ప్రస్తుతం కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు లాక్డౌన్ను పొడిగించింది. ఈ వైరస్ వ్యాప్తితో ప్రజలు బెంబేలెత్తున్నారు. అయితే జంతువుల నుంచి కరోనా వ్యాప్తి చెందుతుందనే పుకార్లతో చాలా మంది తమ ఇంట్లో పెంపుడు జంతువులను తరిమేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయమని వెంకటేష్.. ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ కష్ట సమయంలో పెంపుడు జంతువులకు మన అవసరం ఉంది. ఇది కేవలం మనుషులకు మాత్రమే వచ్చిన కష్టము కాదు.. భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి ఇది కష్ట సమయమే అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే అపోహల కారణంగా చాలా మంది తమ ఇంట్లో ఉన్న జంతువులను తరిమివేయడం దారుణమైన విషయమన్నారు. మనతో సమానమైన జంతువులను ప్రేమించాల్సిన సమయం ఇదే అన్నారు. జంతువులతో కరోనా వ్యాప్తి చెందదు అది తప్పుడు వార్త అని వెంకటేష్ చెప్పుకొచ్చారు.
#COVID2019 #Pets #StayHomeStaySafe pic.twitter.com/WNqVNteLuz
— Venkatesh Daggubati (@VenkyMama) April 14, 2020
కేంద్ర మంత్రిపై ఫైర్ అయిన హీరో