telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఓటీటీకే మొగ్గు చూపుతున్న రకుల్

రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు నాట స్టార్ హీరోయిన్ ఒక వెలుగు వెలిగింది. మరెందుకో ఒక్కసారివా అవకాశాలు ఆమె తలుపు వైపు కూడా చూడలేదు. గత ఏడాది ఆమె ఎన్నో ఎత్తు పల్లాలను చూడాల్సి వచ్చింది. పూర్తిగా తన నటన జీవితం అయిపోయిందన్నట్లుగా మారిపోయింది. అదే సమయంలో అనూహ్యంగా మూడు సినిమా ఆఫర్లు వచ్చాయి. వాటిలో రెండు తెలుగు సినిమాలు కాగా ఒకటి హిందీ సినిమా. కానీ ఈ మూడు సినిమాలు ఓటీటీలో విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈమె క్రిష్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఓటీటీలో విడుదల చేసేందుకు చూస్తున్నారని టాక్ ఉంది. ఇక బాలీవుడ్ సినిమా చూస్తే ఆ సినిమా అర్జున్ కపూర్ హీరోగా తెరకెక్కతోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. అయితే ఈ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఇక తెలుగులో నటించనున్న మరో సినిమా కూడా ఓటీటీ కే అంకితం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో నితిన్ హీరో కాగా రకుల్ సెకండ్ హీరోయిన్‌గా, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఓటీటీ బాట పట్టించేందుకు చర్చలు జరుపుతున్నారు. ఓటీటీ విడుదలకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. దీంతో రకుల్ చేస్తున్న మూడు సినిమాలు ఓటీటీకే పరిమితం కావడంతో థియేటర్లలో ఆమె కనిపించదని సినీ వర్గాలు అంటున్నాయి.

Related posts