శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ… రైతులు అధికారులకు, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అయితే ఈ మధ్య కొంతమంది కేసీఆర్ ను ఇబ్బందులకు గురి చేయాలని, బలహీనపరచాలని చూస్తున్నారు అని ఆరోపించారు. అయితే కేసీఆర్ ను బలహీన పరిస్తే తెలంగాణ సమాజమే బలహీనం అయినట్లు అవుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని పార్టీలు విద్వేష పూరితంగా, ప్రజల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ప్రకటనలు చేస్తున్నాయి అని మండిపడ్డారు. అయితే ఇది చాలా దురదృష్టకరం అని, తెలంగాణ కి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అని తెలిపారు. అంతేకాక రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అని, అంత కూడా ప్రజల సంక్షేమం కోసం పాటు పడాలి అంటూ హితవు పలికారు. కెసిఆర్ లేకపోతే ఎక్కడి గొంగడి అక్కడే అన్న చందంగా మారిపోతుందన్నారు. మరి చూడాలి గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు ఏం చేస్తారు.. ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేది చూడాలి.
next post