చైనాలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ఇప్పుడు ఆ దేశంలో తగ్గుముఖం పడుతుండడంతో పూర్తిస్థాయి పాఠశాలలను తిరిగి తెరవాలని నిర్ణయించింది. చైనాలో ప్రస్తుతం 288 మంది కరోనా రోగులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. మరో 361 మంది ఐసోలేషన్లో ఉన్నారు.
గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 9 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. అయితే వీరంతా బయటి దేశాల నుంచి వచ్చిన వారేనని, స్థానికులు ఎవరూ లేరని ప్రభుత్వం పేర్కొంది. కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడంతో ఇటీవల ప్రభుత్వం బడులు తెరిచింది.
భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి కొవిడ్ నిబంధనలతో తరగతులు నిర్వహిస్తోంది. అయితే, ఇంకా 25 శాతం మంది స్కూళ్లకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే వారం నుంచి పూర్తిస్థాయిలో పాఠశాలలు తెరవాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది.
లేనిపోనివి కల్పించి నాపై దుష్ప్రచారం: లక్ష్మీ పార్వతి