నిఘావర్గాల సమాచారంతో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు భద్రత పెంచారు. ఇటీవల అరెస్ట్ అయిన ఉగ్రవాదుల హిట్లిస్టులో రాజాసింగ్ పేరు ఉన్నట్టు ఇంటలిజెన్స్ సమాచారంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎమ్మెల్యే ఇంటి వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. డీసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో రాజాసింగ్ భద్రతను పర్యవేక్షించనున్నారు.
ప్రభుత్వం సమకూర్చిన బుల్లెట్ ప్రూఫ్ కారులోనే వెళ్లాలని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ కోరారు. మరోవైపు, తనకు భద్రతను పెంచడంపై రాజాసింగ్ స్పందించారు. తనకు ఎవరి నుంచి ముప్పు ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. భద్రత పెంపు విషయమై కేంద్ర, రాష్ట్ర హోంశాఖలకు లేఖ రాస్తానని రాజాసింగ్ పేర్కొన్నారు.