telugu navyamedia
తెలంగాణ వార్తలు

ప్రజల చేత ఎన్నికైన నేతలం… నామినేటెడ్ వ్యక్తులం కాదు-గవర్నర్‌పై మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు

గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. తాము ప్రజాస్వామ్యం ద్వారా ప్రజల చేత ఎన్నికైన నేతలమని, నామినేటెడ్ పదవిలో ఉన్న వ్యక్తులం కాదన్నారు. సీఎంతో పని చేయడం ఇష్టం లేదని గవర్నర్ స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పడం సరికాదని అన్నారు.

బుధవారం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ…ఉపరాష్ట్రపతి, గవర్నర్ అనే పాత్ర చాలా తక్కువ ఉంటుందని.. గవర్నర్‌గా మీ బాధ్యత మీరు నిర్వర్తించండి అంటూ తమిళిసైకి హితవు పలికారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటి వారే ప్రోటోకాల్ విషయంలో కొన్ని రెస్ట్రక్షన్స్ ఉంటాయి అన్నారని… అది కూడా గవర్నర్ తెలుసుకొని మాట్లాడాలని తెలిపారు

రాజ్యంగంలో ఎవరి విధు లు ఏ విధంగా ఉండాలనేది స్పష్టంగా తెలియజేశారని.. ఆ విషయాన్ని విస్మరించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రెస్‌మీట్లు పెట్టి ఏది పడితే అది మాట్లాడటం సరికాదన్నారు. ఒక మహిళగా ఎంత గౌరవం ఇవ్వాలో గవర్నర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారని చెప్పారు.

Related posts