టిక్ టాక్ తో పాటు కేంద్రం 59 చైనా యాప్ లపై నిషేధం విధించిన తరువాత కూడా ఓపెన్ అయిన టిక్ టాక్ సహా పలు యాప్ లు ఇప్పుడు మూగబోయాయి. మొబైల్ ఫోన్లు, డెస్క్ టాప్ వర్షన్లలో యాప్ సేవలు నిలిచిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా టిక్ టాక్ పూర్తిగా ఆఫ్ లైన్ లోకి వెళ్లినట్లయింది.
టిక్ టాక్ యాప్ ను ఓపెన్ చేస్తే నెట్ వర్క్ ఎర్రర్ అన్న మెసేజ్ కనిపిస్తోంది. కాగా, తాము నిబంధనలన్నీ పాటిస్తున్నామని, కస్టమర్ల వివరాలను చైనా సహా ఏ ఇతర దేశంతోనూ పంచుకోలేదని టిక్ టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ నిన్న వెల్లడించిన సంగతి విషయం విధితమే.
వైఎస్ఆర్ కమీషన్ల వల్ల ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి: దేవినేని ఉమ