telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ప్రియాంక గాంధీ కాన్వాయ్‌ కి ప్రమాదం…ఒకదానిని ఒకటి

ప్రియాంక గాంధీ కాన్వాయ్‌లో కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్న ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనలో ప్రియాంక గాంధీ కూడా క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రైతు ఉద్యమంలో చనిపోయిన నవరత్‌ సింగ్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు యూపీలోని హాపుర్‌ జిల్లాకు వెళ్లారు ప్రియాంక.. ఉదయం ఢిల్లీ నుంచి రాంపూర్‌ చేరుకున్న ఆమె.. దిబ్దిబా గ్రామానికి వెళ్తుండగా కాన్వాయిలోని వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో మూడు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నట్టు తెలుస్తుండగా.. ఈ కార్లలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు.  అయితే, ప్రమాదానికి కారణం ప్రియాంక కారే అని చెబుతున్నారు. ఎందుకంటే.. ప్రియాంక కారు వైపర్లు పనిచేయకపోవడంతో రోడ్డు కనబడక ఇబ్బందిపడిన డ్రైవర్.. కారును స్లో చేశాడు.. దీంతో.. వెనుక ఉన్న వాహనాలు ప్రియాంక వాహనాన్ని ఢీకొట్టాయి. దీంతో.. ఆమె కాన్వాయ్‌కి కాసేపు ఆగిపోయింది.. కారు దిగిన ప్రియాంక.. గుడ్డ తీసుకుని కారు అద్దాలను శుభ్రం చేశారు.. ఆ తర్వాత దిబ్దిబా గ్రామానికి వెళ్లారు.

Related posts