తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ను బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం అదనపు ఎగ్జిక్యూటివ్ గా ఉన్న ధర్మారెడ్డిని ఇన్ చార్జ్ ఈఓగా నియమిస్తున్నట్టు వెల్లడించింది. అనిల్ కుమార్ ను వైద్య ఆరోగ్య శాఖ చీఫ్ సెక్రెటరీగా నియమిస్తున్నట్టు కూడా పేర్కొంది.
అనిల్ కుమార్ సింఘాల్ 1993 బ్యాచ్ చెందిన ఐఏఎస్ అధికారి. గతంలో ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ కమిషనర్ గా పనిచేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆయన టీటీడీ ఈఓగా 2017లో బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్ల కాలపరిమితికి ఆయన బాధ్యతలు స్వీకరించగా, 2019లో మరో ఏడాది పాటు ఆయన పదవీకాలాన్ని పొడిగించారు.
దాదాపు మూడు సంవత్సరాల నాలుగు నెలల పాటు టీటీడీ ఈఓగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్, సామాన్యులకు స్వామివారి దర్శనాన్ని మరింత దగ్గర చేస్తూ, కీలక సంస్కరణలను అమలు చేశారు. క్యూలైన్లలో రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా టైమ్ స్లాట్ టోకెన్ విధానాన్ని అమలు చేశారు.
చంద్రబాబు పార్టీ శ్రేణులకు ఏం నమ్మకం ఇవ్వగలడు: విజయసాయి