టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. తనపై తను నమ్మకం కోల్పోయిన వ్యక్తి పార్టీ శ్రేణులకు ఏం నమ్మకం ఇవ్వగలడని ప్రశ్నించారు. ‘‘చరిత్ర పుస్తకంలో చిరిగిన కాగితం చంద్రబాబు అని అన్నారు. వర్తమానం లేదు, భవిష్యత్తు లేదని వ్యాఖ్యానించారు.
తనపై తనే నమ్మకం కోల్పోయిన వ్యక్తి పార్టీ శ్రేణులకు ఏం ధైర్యం ఇవ్వగలడు. తప్పులను సవరించుకునే బదులు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రం నలుచెరుగులా ఏలిన పార్టీని నాలుగు గ్రామాలకు పరిమితం చేశాడని విజయసాయిరెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు.