కేబుల్ కనెక్షన్ ద్వారా టీవీ చూసే వారికి ఇక పై టారిఫ్ భారం తగ్గనుంది. 2020, మార్చి 1 నుంచి కొత్త టారిఫ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వినియోగదారులపై తగ్గనున్న టారిఫ్ భారం. న్యూ టారిఫ్ సేవలకు ట్రాయ్ సవరణలు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ట్రాయ్ జారీ చేసింది.
ఈ నిర్ణయం వల్ల వినియోగదారులు ఇకపై 200 ఫ్రీ టూ ఎయిర్ ఛానెల్స్ రూ. 130 కే పొందవచ్చు. ఇప్పటివరకు 130 రూపాయలకు 100 ఛానెల్స్ మాత్రమే వచ్చేవి. ఈ మధ్య కాలంలో డీటీహెచ్ సేవలు అందుబాటులో వచ్చాయి. ఒక సంస్థను మించి మరో సంస్థ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోటీ తట్టుకునేందుకు కేబుల్ వారు కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు.
మనీష్ ను పక్కన పెట్టడం పై వార్నర్ సంచలన వ్యాఖ్యలు…