telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

నీ జేసిబి ఊపులకు భయపడే వాడు ఎవడూ లేడు జగన్ రెడ్డి : లోకేష్

జగన్ సర్కార్ పై నారా లోకేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని.. జేసీబితో పోల్చారు. విశాఖలో టిడిపి మాజీ ఎమ్యెల్యే పల్లా శ్రీనివాస్ కు చెందిన బిల్డింగ్ ను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూల్చివేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఈ ఘటనపై నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “ప్రజల ప్రాణాలు గాలికొదిలి ప్రతిపక్ష నేతల భవనాలు కూల్చే పనిలో బిజీగా ఉన్నారు జగన్ రెడ్డి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించి, కార్మికుల పక్షాన నిలిచినందుకే టిడిపి నేత పల్లా శ్రీనివాస్ గారి పై సిఎం జగన్ కక్షపూరిత చర్యలకు దిగారు. విశాఖ ఉక్కుని తుక్కు రేటుకి కొట్టేయాలని ప్లాన్ చేసిన జగన్ రెడ్డికి అడ్డొచ్చారు అనే అక్కసుతోనే ఆదివారం పూట పల్లా గారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. అందుకే ఈ వైకాపా ప్రభుత్వాన్ని జేసీబి ప్రభుత్వం అన్నది. కనీసం నోటీసు ఇవ్వకుండా,చట్టాన్ని తుంగలో తొక్కి యుద్ధవాతావరణంలో భవనాన్ని కూల్చివేయడాన్ని, కక్షసాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. నీ జేసిబి ఊపులకు భయపడే వాడు ఎవడూ లేడు జగన్ రెడ్డి.” అంటూ లోకేష్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

Related posts