telugu navyamedia
రాజకీయ వార్తలు

“కరోనా” బాధితులకు ప్రత్యేక వార్డుల్లో చికిత్స: కిషన్‌ రెడ్డి

Kishan Reddy

దేశంలో కరోనా వైరస్‌పై వ్యాప్తిచెందకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఐదు మంత్రిత్వ శాఖల మంత్రులతో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ నేతృత్వంలో ఈ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ పని చేస్తుందని కిషన్‌ రెడ్డి తెలిపారు.

రాష్ర్టాలకు నిర్ధారణ కిట్లు, వైద్య బృందాల తరలింపుపై కమిటీ చర్చిస్తుందని చెప్పారు. కరోనా వైరస్‌ సోకిన బాధితులకు ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. కేరళ సహా ఇతర రాష్ర్టాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం. చైనా నుంచి విద్యార్థులు, ఇంజినీర్లను తీసుకొచ్చి పర్యవేక్షణలో ఉంచామని కిషన్‌ రెడ్డి తెలిపారు.

Related posts