ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి అధికారులు ఝలక్ ఇచ్చారు. బుధవారం ఉద్యానవన శాఖ సమీక్ష ఏర్పాటు చేశారు. అయితే ఆ సమీక్షకు వ్యవసాయ శాఖ అధికారులు ఏవరూ హాజరుకాకపోవటంతో ఖంగుతిన్నారు. చేసేదేమీ లేక సమీక్షను రద్దు చేసుకున్నారు. ఈ రోజైనా సమీక్ష నిర్వహించాలని భావించిన సోమిరెడ్డి! అధికారులు రావాలని ఆదేశించారు.
కానీ వ్యవసాయ అధికారులు హాజరుకాకపోవటంతో భంగపడ్డ మంత్రి సమీక్ష రద్దు చేసుకున్నారు.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనే వ్యవసాయశాఖపై సమీక్ష నిర్వహించేందుకు ఆయన సచివాలయానికి వచ్చారు. సమీక్షకు హాజరు కావాలని అధికారులకు కార్యాలయం సమాచారం అందించింది. అయితే, ఎన్నికల కోడ్ ఉండటంతో సమీక్షకు హాజరయ్యే విషయంలో ఎన్నికల సంఘాన్ని అధికారులు స్పష్టత కోరారు. ఈ క్రమంలో మంత్రి సోమిరెడ్డి సమీక్షకు వారు హాజరు కాలేదు.