సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను లక్నో నుంచి గురాగ్రామ్ మేదాంత ఆసుపత్రికి ఛార్టర్డ్ ఫ్లైట్ లో తరలించారు. బీపీ, షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని ఆయనను పరీక్షించిన లక్నో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం నిన్న ఉదయం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
నిన్న ములాయం నివాసానికి వెళ్లిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయనను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కుంభమేళాకు సంబంధించి ఒక పుస్తకాన్ని ములాయంకు బహూకరించారు. ఇంటివద్ద ఉన్న వైద్యులు ఆయన ఆరోగ్యాన్నిరోజంతా పరీక్షిస్తూనే ఉంది. అయినా, సాయంత్రానికల్లా ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దీంతో నిన్న రాత్రి ఆయనను లక్నో నుంచి గురుగ్రామ్ కు తరలించారు.
ప్రభుత్వాన్ని కూలిస్తే రూ.100 కోట్లు ఆఫర్!