ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ రోజువారీ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 46,558 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 800 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు ఏపీలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,54,663కి చేరింది.
గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 9 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు ఏపీలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 14,228కి చేరింది. నిన్న కరోనా నుంచి కోలుకుని 1178 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని బయటపడ్డవారి సంఖ్య 20,31,681 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 8,754 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
రెండు గాజులు ఇస్తే ఎవరు నమ్మరు.. నారా భువనేశ్వరిపై రోజా ఫైర్