గ్రేటర్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. దీంతో అధికార, విపక్షాలు గెలుపే లక్ష్యంగా ప్రచారాలకు సిద్ధం అవుతున్నాయి. అధికార పార్టీని ఢీ కొట్టేందుకు విపక్షాలు గట్టిగానే ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. అటు అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా విపక్షాలకు తగ్గట్టుగానే అస్త్రాలను తయారు చేసుకుంటున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ తరుణంలో గ్రేటర్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. దీనిలో భాగంగా కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ను బీజేపీ రంగంలోకి దించనుంది. ఆయన హైదరాబాద్కు వచ్చి.. బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. టీఆర్ఎస్ గత మేనిఫెస్టోపైనా చార్జ్ షీట్ విడుదల చేయనున్నారు. రోడ్ షోలు కూడా నిర్వహించనున్నారు. అంతేకాదు.. స్మృతి ఇరానీ సహా మరో ఇద్దరు కేంద్రమంత్రులతో ప్రచారం చేయించనుంది బీజేపీ పార్టీ. ఇది ఇలా ఉండగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రచార బరిలోకి దిగనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది కమలం పార్టీ. అయితే.. ఏ మేరకు ఈ ఎన్నికల్లో సక్సెస్ అవుతారో చూడాలి.
previous post
రాబర్ట్ వాద్రాను వదిలేది లేదు: మోదీ