కౌంట్డౌన్ స్టార్టయ్యింది.. కోట్లాది మంది ఎదురు చూస్తున్న దుబ్బాక ఫలితానికి ఈఒక్కరోజతో తేలిపోనుంది.. రాష్ట్రంలో ఏకైక ఉప ఎన్నిక కావడంతో అంతటా ఆసక్తి నెలకొన్నది. అందరి చూపు ఇటువైపే మళ్లింది. ఈ నెల 3వ తేదీన పోలింగ్ జరుగగా ఈనెల 10న అంటే మంగళవారం అభ్యర్థుల భవితవ్యం బయటపడనుంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్లో భాగంగా 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఈ టేబుళ్లపై 23 రౌండ్ల పాటు ఈవీఎంలను లెక్కిస్తారు. దుబ్బాక నియోజకవర్గంలోని 315 పోలింగ్ కేంద్రాల్లో 1,64,192 ఓట్లు పోలయ్యాయి. ఈవీఎంలను ఓపెన్ చేయడం, వాటిని లెక్కించడం త్వరత్వరగానే పూర్తవుతాయి. ఎప్పటికప్పుడు రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటించేలా ఏర్పాట్లు చేశారు. అయితే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించగా అందులో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. కానీ మొదటి రౌండ్ కౌంటింగ్ లో అనూహ్యంగా బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. ఇప్పటివరకు తెరాస-2867 బీజేపీ-3208 , కాంగ్రెస్ కు 648 వచ్చాయి.
previous post
next post