telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గంటా చక్రపాణికి పితృవియోగం

Ganta chakrapani

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణికి పితృ వియోగం కలిగింది. ఘంటా చక్రపాణి తండ్రి మొగలయ్య(89) అనారోగ్యంతో మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో గతకొంతకాలంగా బాధపడుతున్న మొగలయ్య నగరంలోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం 9 గంటలకు తుదిశ్వాస విడిచారు. మొగలయ్య మరణవార్త తెలిసిన మంత్రి జగదీష్‌ రెడ్డి నిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. మొగలయ్య భౌతికకాయాన్ని వారి స్వస్థలం కరీంనగర్‌ జిల్లాకు తరలిస్తున్నారు.

Related posts