telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రోజుకో నిర్ణయంతో రాష్ట్రం అల్లకల్లోలం: అఖిలప్రియ

bhuma akhila into ycp soon

ప్రభుత్వం రోజుకో నిర్ణయం తీసుకుని రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తోందని ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ అన్నారు. మూడు రాజధానుల వైఖరి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఆమె దుయ్యబట్టారు. మూడు ప్రాంతాల్లో విద్వేషాలు రగిలితే, జిల్లాకో రాజధాని పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

రాష్ట్ర విభజనతో రాయలసీమ వాసులు ఇప్పటికే ఎంతో నష్టపోయారని గుర్తుచేశారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని, లేదంటే రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు హైకోర్టు వస్తే లాయర్లకు ఉపయోగమని, ప్రజలకు కాదన్నారు. హైకోర్టుతో పాటు ఆగిపోయిన ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Related posts