వైఎస్ షర్మిల ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఆమ్ కొత్త పెట్రీ పెట్టడం ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. అయితే ప్రస్తుతం వరుస భేటీలతో ఆమె సమాలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం రోజు చెబుతున్నా తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను కాపాడుకోవాలని.. లేకపోతే రాబోయే రోజుల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటామని పేర్కొన్నారు. ఇప్పుడు జగనన్న బాణం షర్మిల వస్తోందని…తర్వాత మెల్లగా జగన్ వస్తాడు ఆ తర్వాత చంద్రబాబు కూడా వస్తాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మళ్లీ కొట్లాటలు, విధ్వంసాలు, ఫ్యాక్షన్ తప్పదని గంగుల సూచించారు మంత్రి గంగుల. ఆంధ్ర పెత్తనం వస్తే మళ్లీ మనకు కష్టాలు తప్పవని….ఇప్పటికే తెలంగాణ బాగా అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. అన్న, చెల్లెల్లకు గొడవలు ఉంటే మీరు… మీరు చూసుకోండి…మాపై ఎందుకు రుద్దడం అని ప్రశ్నించారు మంత్రి గంగుల కమలాకర్.
previous post
next post


టీటీడీ బోర్డును సీబీఐ ఛార్జ్ షీట్ లా చేశారు: అనురాధ ఫైర్