telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సీఎం కేసీఆర్‌కు ఏపీ రైతుల గిఫ్ట్‌…

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టిన రోజును పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా కడియం పల్ల వెంకన్న నర్సరీ నిర్వాహకులు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా వాసులు పల్ల సత్తిబాబు, పల్ల సుబ్రహ్మణ్యం, పల్ల గణపతి రంగురంగుల పూలు, పూలమొక్కలతో సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని సృజనాత్మకంగా తీర్చిదిద్ది జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమంతో ప్రేరణ పొంది తాము ఈ విధంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపామని వారు తెలిపారు. తెలంగాణేతర ప్రజలు ఈ విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం పలువురిని ఆకర్షించింది. కాగా… సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా బల్కం పేట అమ్మవారి ఆలయంలో ఎల్లమ్మ అమ్మవారికి రెండున్నర కిలోల బంగారు చీరను బహుకరించారు మంత్రి తలసాని, కూన వెంకటేష్ గౌడ్, ఆలయ ఈవో అన్నపూర్ణ. 

Related posts