telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పా ట్లు పూర్తి: మహమూద్ అలీ

Mahmood ali,Congress,Bjp

గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అవసరమైన చర్యలు చేపట్టామని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఆదివారం డబీర్‌పురాలోని బీబీకా ఆలంను సందర్శించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ మొహర్రం సంతాప దినాలతోపాటు గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశామని తెలిపారు.

మంగళవారం మొహర్రం సంతాప దినాల్లోని పదో రోజున నిర్వహించే మొహర్రం సంతాప ర్యాలీ నిర్వహణతోపాటు ర్యా లీ నిర్వహించే ప్రాంతాల్లోనూ తగిన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిమజ్జనం రోజున సాగే ప్రధాన ఊరేగింపులో నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సుమారు 40వేల విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. ఊరేగింపు కొనసాగే మార్గాల్లో సాయుధ బలగాల మోహరింపుతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ర్యాలీని పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు.

Related posts